పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా। 8
పద్మరాగ మణుల గురించి మనం ఇప్పటికే చదువుకున్నాం 14వ నామం ఐన కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా అన్న దాని వ్యాఖ్యలో.
ఈ పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః అన్న నామంలో పరిభావము అనే పద విశేషం ఉంది. పరిభావం అన్నా పరాభవం అన్నా ఒక్కటే. పరిభావి అంటే పరాభవించేది అని అర్థం.
పరిభావి కపోలభూః అన్నారు. కపోలము అంటే చెక్కెలి. దీనిని బట్టి అమ్మ నామం పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః అన్నది అమ్మ చెక్కిళ్ళకు సంబంధించినది అని తెలుస్తోంది కదా.
ఆదర్శం అన్న మాటను మనం తరచుగానే వింటూ ఉంటాం. ఇక్కడ ఆదర్శం అన్న మాట ఎక్కడుందంటారా? శిలాదర్శ అన్నమాటను విడదీసి చూస్తే అది శిలా + ఆదర్శ అన్న మాటల కలయిక అని తెలుస్తుంది సులువుగానే. శిల అంటే రాయి. ఇది మామూలు రాయి కాదు. పద్మరాగశిల అందుకే పద్మరాగశిలాదర్శ అన్నారు.
ఇంక ఆదర్శం అంటే అర్థం అద్దం అని!
సరే ఇంక ఈ నామం చెప్పే భావం ఏమిటో తెలుసుకుందాం.
పద్మరాగాలు మణులు. కాని మణులూ శిలావిశేషాలే. అందుకే పద్మరాగశిలా అన్నారు. ఈ శిలలు ఎంతో నున్నగా ఉంటాయి. అంటే చక్కగా అద్దాల్లాగా అన్నమాట. అద్దాల్లాగా ఉండటం అంటే వాటిలో మన బొమ్మ చూసుకోవచ్చును. అంత నున్నగా ఉంటాయి.
అద్దాల్లాగా ఉన్న పద్మరాగశిలలు ఎఱ్ఱగా నున్నగా అందంగా ఉంటాయి.
ఐతే వాటి కన్నా గొప్పవి ఉన్నాయి లెండీ, వాటి గొప్ప ఒక లెక్కా అంటూన్నారు.
అమ్మ చెక్కిళ్ళూ ఎఱ్ఱగా నున్నగా అందంగా ఉంటాయి.
వాటి ముందు ఆ పద్మరాగ శిలల అద్దాలు దిగదుడుపే అంటున్నారు వశిన్యాదులు స్తోత్రం చేస్తూ అమ్మని. అమ్మ చెక్కిళ్ళ అరుణిమ ముందు పద్మరాగా లేపాటీ, అమ్మ చెక్కిళ్ళ నున్నదనం ముందు ఆ పద్మారాగా లేపాటీ అని పద్మరాగాలను అమ్మ చెక్కిళ్ళు తిరస్కరిస్తున్నాయి అని చెప్తున్నారు.
పద్మరాగశిలలను అద్దాల్లాగా సానబడితే ఆ అద్దాల్లో మన ప్రతిబింబం చూసుకోవచ్చునే. మరి అంతకు మించినవి అమ్మ చెక్కిళ్ళు అని అంటున్నారు చూడండి, ఆ అనటంలో ఒక చమత్కారం ఉంది. అమ్మ చెక్కిళ్ళనే అద్దాల్లో కామేశ్వరుడి ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుందని ఆ చమత్కారం.
మంచి వయస్సులో అంటే నిండుయౌవనంలో ఉన్న అమ్మాయి చెక్కిళ్ళి కించిత్తుగా ఎరుపుదనం కలిగి ఉండటం సహజం. అందులోనూ అందమైన అమ్మాయి ఐతే ఇంక చెప్పేదేముందీ? ఇంక మృదుత్వమా సరేసరి.
అమ్మ సర్వలోకాల్లోనూ ప్రతిలేని సౌందర్యరాశి.
ఆవిడ నిత్యయౌవన మూర్తి.
అందుచేత ఆవిడ చెక్కిళ్ళు మరెంత మృదువుగా ఉంటాయీ? మరెంత ఎఱ్ఱగా ఉంటాయీ? మీరే ఊహించుకోండి.
అన్నట్లు, నిత్యయౌవనా అన్నది కూడా అమ్మ సహస్రనామాల్లో ఒకటి. ఇది ముందుముందు వస్తుంది 430వ నామంగా.
అమ్మ యజ్ఞకుండం నుండి ఆవిర్బవించిన సమయంలో తల్లి ముఖ మండలం కామేశ్వరుడి తేజస్సుతో ఏర్పడింది. అందుచేత అమె చెక్కిళ్ళలో కామేశ్వరుడే దర్శనీయుడు కావటం సూచితంగా ఉండటం మనోహరంగా ఉంది.
అమ్మ ముఖమండలాన్ని ధ్యానం చేసే భక్తులకు అమ్మ ముఖదర్శనంతో బాటే కామేశ్వరదేవుడి దర్సనమూ అవుతున్నది అన్నది మనం గ్రహించవలసిన రహస్యం.
శ్రీవిద్యలో బహిర్మాతృకాన్యాసంలో కుడి ఎడమ కపోలాలకు ల, లూ అనేవి న్యాసాక్షరాలు.
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా। 8
పద్మరాగ మణుల గురించి మనం ఇప్పటికే చదువుకున్నాం 14వ నామం ఐన కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా అన్న దాని వ్యాఖ్యలో.
ఈ పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః అన్న నామంలో పరిభావము అనే పద విశేషం ఉంది. పరిభావం అన్నా పరాభవం అన్నా ఒక్కటే. పరిభావి అంటే పరాభవించేది అని అర్థం.
పరిభావి కపోలభూః అన్నారు. కపోలము అంటే చెక్కెలి. దీనిని బట్టి అమ్మ నామం పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః అన్నది అమ్మ చెక్కిళ్ళకు సంబంధించినది అని తెలుస్తోంది కదా.
ఆదర్శం అన్న మాటను మనం తరచుగానే వింటూ ఉంటాం. ఇక్కడ ఆదర్శం అన్న మాట ఎక్కడుందంటారా? శిలాదర్శ అన్నమాటను విడదీసి చూస్తే అది శిలా + ఆదర్శ అన్న మాటల కలయిక అని తెలుస్తుంది సులువుగానే. శిల అంటే రాయి. ఇది మామూలు రాయి కాదు. పద్మరాగశిల అందుకే పద్మరాగశిలాదర్శ అన్నారు.
ఇంక ఆదర్శం అంటే అర్థం అద్దం అని!
సరే ఇంక ఈ నామం చెప్పే భావం ఏమిటో తెలుసుకుందాం.
పద్మరాగాలు మణులు. కాని మణులూ శిలావిశేషాలే. అందుకే పద్మరాగశిలా అన్నారు. ఈ శిలలు ఎంతో నున్నగా ఉంటాయి. అంటే చక్కగా అద్దాల్లాగా అన్నమాట. అద్దాల్లాగా ఉండటం అంటే వాటిలో మన బొమ్మ చూసుకోవచ్చును. అంత నున్నగా ఉంటాయి.
అద్దాల్లాగా ఉన్న పద్మరాగశిలలు ఎఱ్ఱగా నున్నగా అందంగా ఉంటాయి.
ఐతే వాటి కన్నా గొప్పవి ఉన్నాయి లెండీ, వాటి గొప్ప ఒక లెక్కా అంటూన్నారు.
అమ్మ చెక్కిళ్ళూ ఎఱ్ఱగా నున్నగా అందంగా ఉంటాయి.
వాటి ముందు ఆ పద్మరాగ శిలల అద్దాలు దిగదుడుపే అంటున్నారు వశిన్యాదులు స్తోత్రం చేస్తూ అమ్మని. అమ్మ చెక్కిళ్ళ అరుణిమ ముందు పద్మరాగా లేపాటీ, అమ్మ చెక్కిళ్ళ నున్నదనం ముందు ఆ పద్మారాగా లేపాటీ అని పద్మరాగాలను అమ్మ చెక్కిళ్ళు తిరస్కరిస్తున్నాయి అని చెప్తున్నారు.
పద్మరాగశిలలను అద్దాల్లాగా సానబడితే ఆ అద్దాల్లో మన ప్రతిబింబం చూసుకోవచ్చునే. మరి అంతకు మించినవి అమ్మ చెక్కిళ్ళు అని అంటున్నారు చూడండి, ఆ అనటంలో ఒక చమత్కారం ఉంది. అమ్మ చెక్కిళ్ళనే అద్దాల్లో కామేశ్వరుడి ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుందని ఆ చమత్కారం.
మంచి వయస్సులో అంటే నిండుయౌవనంలో ఉన్న అమ్మాయి చెక్కిళ్ళి కించిత్తుగా ఎరుపుదనం కలిగి ఉండటం సహజం. అందులోనూ అందమైన అమ్మాయి ఐతే ఇంక చెప్పేదేముందీ? ఇంక మృదుత్వమా సరేసరి.
అమ్మ సర్వలోకాల్లోనూ ప్రతిలేని సౌందర్యరాశి.
ఆవిడ నిత్యయౌవన మూర్తి.
అందుచేత ఆవిడ చెక్కిళ్ళు మరెంత మృదువుగా ఉంటాయీ? మరెంత ఎఱ్ఱగా ఉంటాయీ? మీరే ఊహించుకోండి.
అన్నట్లు, నిత్యయౌవనా అన్నది కూడా అమ్మ సహస్రనామాల్లో ఒకటి. ఇది ముందుముందు వస్తుంది 430వ నామంగా.
అమ్మ యజ్ఞకుండం నుండి ఆవిర్బవించిన సమయంలో తల్లి ముఖ మండలం కామేశ్వరుడి తేజస్సుతో ఏర్పడింది. అందుచేత అమె చెక్కిళ్ళలో కామేశ్వరుడే దర్శనీయుడు కావటం సూచితంగా ఉండటం మనోహరంగా ఉంది.
అమ్మ ముఖమండలాన్ని ధ్యానం చేసే భక్తులకు అమ్మ ముఖదర్శనంతో బాటే కామేశ్వరదేవుడి దర్సనమూ అవుతున్నది అన్నది మనం గ్రహించవలసిన రహస్యం.
శ్రీవిద్యలో బహిర్మాతృకాన్యాసంలో కుడి ఎడమ కపోలాలకు ల, లూ అనేవి న్యాసాక్షరాలు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి