పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా। 8
ఈ నామం నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా అనే దానిలో ఉన్న పదాల అర్థాలను ముందుగా చూదాం.
నవ అంటే తాజాగా ఉన్న అని అర్థం.
విద్రుమం అంటే పగడం.
బింబం అంటే దొండపండు
న్యక్కారం అంటే తిరస్కారం. ఛీకొట్టటం అన్నమాట.
రదనం అంటే దంతము. అనగా పన్ను.
ఛదము అంటే ఆఛ్ఛాదనము అనగా కప్పు.
రదనఛ్ఛదము అంటే దంతములను కప్పి ఉంచేది. అనగా పెదవి అని అర్థం.
ఈ నామంలో ప్రస్తావించిన విద్రుమమూ, బింబమూ రెండూ ఎఱ్ఱనివి. ఇక్కడ వాటికి రెండింటికీ అన్వయించే విధంగా నవ అన్న పదం ముందుగా జోడించారు కాబట్టి తాజా పగడాలూ దొండపండ్లూ అని గ్రహించాలి.
తాజా దొండపండు అంటే తెలుస్తుంది. దొండకాయ బాగా పండితే అది చాలా ఎఱ్ఱగా ఉంటుంది. అది.
కాని తాజా పగడం ఏమీటీ అనవచ్చును. తాజా పగడం అంటే అప్పుడే మెరుగుపెట్టిన పగడం అన్నమాట. ఏ మాలిన్యమూ అంటని దానికి మంచి శోభ ఉంటుంది.
ఈ రెండింటి యొక్క అరుణిమనూ కూడా అమ్మ పెదవులు త్రోసివేస్తున్నాయని ఈ నామం తాత్పర్యం. అమ్మ పెదవులు సర్వకాలాల్లోనూ సహజమైన గొప్ప అరుణిమను కలిగి ఉంటాయని చెప్పటం ఈ నామం ఉద్దేశం.
పరోక్షంగా దొండపండు శోభ కొంచెమే, అదీ కొద్దికాలమే. ఎంత అందంగా మెరుగుపెట్టిన పగడం ఐనా అది గాలిలోని దూళిని పట్టుకొని కాంతిహీనం అవుతుంది మెల్లగా. కాని అమ్మ పెదవుల సౌందర్యం కాలాతీతమైనది అని స్పష్టం చేయటం అన్నమాట.
శంకరభగవత్పాదుల సౌందర్యలహరీ స్తోత్రంలోని ఈ 62వ శ్లోకం చూడండి.
ప్రకృత్యా రక్తాయాస్తవ సుదతి దన్తచ్ఛదరుచేః
ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా
న బిమ్బం తద్బిమ్బప్రతిఫలనరాగాదరుణితం
తులామధ్యారోఢుం కథమివ విలజ్జేత కలయా
ఇక్కడ శంకరులు అమ్మను ఉద్దేశించి అంటున్నారు. చక్కటి పళ్ళ వరుస ఉన్న తల్లీ!, నీ పెదవులు స్వభావసిధ్ధంగానే కెంపులవలె రక్తవర్ణంలో ఉన్నాయి. వాటిని మరి వేటితోనూ పోల్చటం కుదరదు.
నీ క్రిందిపెదవికి సహజమైన కాంతి ఉన్నది. అది పగడపు తీవకు పండు కాస్తే ఆ పండు ఎలా ఉంటుందో అలా ఉంది. కాని ఏంచేసేదీ, పగడపు తీగ అంటారే కాని అలాంటి తీగ లేదు. పగడాలు తీగలకి కాయవు. అవి పండటం మరింత అబధ్ధం.
పోనీ దొండపండుతో పోలుద్దాం అనుకుందాం. దొండపండు ఎఱ్ఱగా ఉన్నా అది కాంతిమంతంగా ఉండదే. అసలు దొండపండును బింబం అంటాం. బింబం అంటే ప్రతిబింబించేది అని కదా వ్యుత్పత్తి? ఆ దొండపండుకు బింబం అన్న పేరు రావటానికి కారణం అది నీ అధరాలను ప్రతిబింబించటం వల్లనే కాని దాని గొప్ప యేం లేదు.
అంటే శంకరుల ఆలోచనకు పిండితార్థం, అమ్మ పెదవుల శోభను పోల్చటానికి మనకు వేరే వస్తువు లోకంలో లేదు అని.
మహాకవి కాళిదాసు గురించి తెలుసును కదా? ఆయన అమ్మపై చేసిన శ్యామలాదండకం జగత్తులో మహా ప్రసిధ్ధికి ఎక్కినది. అందులో ఆయన
కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలకల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే,
అని అన్నారు. ఇక్కడ శోణాధరే అన్నదానికి అర్ధం ఎఱ్ఱని పెదవులు కల తల్లీ అనే. పక్వబింబాధరే అని ముక్తాయించి చెప్తున్నారు కదా పక్వబింబం అంటే చక్కగా పండిన దొండపండు అని. ఈ పక్వ అన్న మాటమీద నవత్వాన్ని ఆరోపించుకొనవచ్చును.
అమ్మ పెదవుల అరుణిమ సహజమైనది. ఆ అరుణిమతో అమ్మ స్మేరశోణాధరే అనగా చిన్నగా నవ్వుతున్న తల్లి అని అర్థం.
పెదవుల్లో పైపెదవికి విద్రుమం అనీ క్రిందిపెదవికి బింబం అనీ సంజ్ఞలు ఉన్నాయట.
బహిర్మాతృకాన్యాసంలో పెన క్రింద పెదవులకు ఏ ఐ అన్నవి న్యాసబీజాలు.
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా। 8
ఈ నామం నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా అనే దానిలో ఉన్న పదాల అర్థాలను ముందుగా చూదాం.
నవ అంటే తాజాగా ఉన్న అని అర్థం.
విద్రుమం అంటే పగడం.
బింబం అంటే దొండపండు
న్యక్కారం అంటే తిరస్కారం. ఛీకొట్టటం అన్నమాట.
రదనం అంటే దంతము. అనగా పన్ను.
ఛదము అంటే ఆఛ్ఛాదనము అనగా కప్పు.
రదనఛ్ఛదము అంటే దంతములను కప్పి ఉంచేది. అనగా పెదవి అని అర్థం.
ఈ నామంలో ప్రస్తావించిన విద్రుమమూ, బింబమూ రెండూ ఎఱ్ఱనివి. ఇక్కడ వాటికి రెండింటికీ అన్వయించే విధంగా నవ అన్న పదం ముందుగా జోడించారు కాబట్టి తాజా పగడాలూ దొండపండ్లూ అని గ్రహించాలి.
తాజా దొండపండు అంటే తెలుస్తుంది. దొండకాయ బాగా పండితే అది చాలా ఎఱ్ఱగా ఉంటుంది. అది.
కాని తాజా పగడం ఏమీటీ అనవచ్చును. తాజా పగడం అంటే అప్పుడే మెరుగుపెట్టిన పగడం అన్నమాట. ఏ మాలిన్యమూ అంటని దానికి మంచి శోభ ఉంటుంది.
ఈ రెండింటి యొక్క అరుణిమనూ కూడా అమ్మ పెదవులు త్రోసివేస్తున్నాయని ఈ నామం తాత్పర్యం. అమ్మ పెదవులు సర్వకాలాల్లోనూ సహజమైన గొప్ప అరుణిమను కలిగి ఉంటాయని చెప్పటం ఈ నామం ఉద్దేశం.
పరోక్షంగా దొండపండు శోభ కొంచెమే, అదీ కొద్దికాలమే. ఎంత అందంగా మెరుగుపెట్టిన పగడం ఐనా అది గాలిలోని దూళిని పట్టుకొని కాంతిహీనం అవుతుంది మెల్లగా. కాని అమ్మ పెదవుల సౌందర్యం కాలాతీతమైనది అని స్పష్టం చేయటం అన్నమాట.
శంకరభగవత్పాదుల సౌందర్యలహరీ స్తోత్రంలోని ఈ 62వ శ్లోకం చూడండి.
ప్రకృత్యా రక్తాయాస్తవ సుదతి దన్తచ్ఛదరుచేః
ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా
న బిమ్బం తద్బిమ్బప్రతిఫలనరాగాదరుణితం
తులామధ్యారోఢుం కథమివ విలజ్జేత కలయా
ఇక్కడ శంకరులు అమ్మను ఉద్దేశించి అంటున్నారు. చక్కటి పళ్ళ వరుస ఉన్న తల్లీ!, నీ పెదవులు స్వభావసిధ్ధంగానే కెంపులవలె రక్తవర్ణంలో ఉన్నాయి. వాటిని మరి వేటితోనూ పోల్చటం కుదరదు.
నీ క్రిందిపెదవికి సహజమైన కాంతి ఉన్నది. అది పగడపు తీవకు పండు కాస్తే ఆ పండు ఎలా ఉంటుందో అలా ఉంది. కాని ఏంచేసేదీ, పగడపు తీగ అంటారే కాని అలాంటి తీగ లేదు. పగడాలు తీగలకి కాయవు. అవి పండటం మరింత అబధ్ధం.
పోనీ దొండపండుతో పోలుద్దాం అనుకుందాం. దొండపండు ఎఱ్ఱగా ఉన్నా అది కాంతిమంతంగా ఉండదే. అసలు దొండపండును బింబం అంటాం. బింబం అంటే ప్రతిబింబించేది అని కదా వ్యుత్పత్తి? ఆ దొండపండుకు బింబం అన్న పేరు రావటానికి కారణం అది నీ అధరాలను ప్రతిబింబించటం వల్లనే కాని దాని గొప్ప యేం లేదు.
అంటే శంకరుల ఆలోచనకు పిండితార్థం, అమ్మ పెదవుల శోభను పోల్చటానికి మనకు వేరే వస్తువు లోకంలో లేదు అని.
మహాకవి కాళిదాసు గురించి తెలుసును కదా? ఆయన అమ్మపై చేసిన శ్యామలాదండకం జగత్తులో మహా ప్రసిధ్ధికి ఎక్కినది. అందులో ఆయన
కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలకల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే,
అని అన్నారు. ఇక్కడ శోణాధరే అన్నదానికి అర్ధం ఎఱ్ఱని పెదవులు కల తల్లీ అనే. పక్వబింబాధరే అని ముక్తాయించి చెప్తున్నారు కదా పక్వబింబం అంటే చక్కగా పండిన దొండపండు అని. ఈ పక్వ అన్న మాటమీద నవత్వాన్ని ఆరోపించుకొనవచ్చును.
అమ్మ పెదవుల అరుణిమ సహజమైనది. ఆ అరుణిమతో అమ్మ స్మేరశోణాధరే అనగా చిన్నగా నవ్వుతున్న తల్లి అని అర్థం.
పెదవుల్లో పైపెదవికి విద్రుమం అనీ క్రిందిపెదవికి బింబం అనీ సంజ్ఞలు ఉన్నాయట.
బహిర్మాతృకాన్యాసంలో పెన క్రింద పెదవులకు ఏ ఐ అన్నవి న్యాసబీజాలు.
అంబ కంబుకంఠి చారుకదంబగహనసంచారిణి
రిప్లయితొలగించండిబింబాధర తటిత్కోటి నిభాభరి దయావారినిధే
శంబరారివైరి హృచ్చంకరి కౌమారి స్వరజిత
తుంబురు నారద సంగీతమాధుర్యే దురిత హారిణి మాయమ్మ!
చాలా బాగా వివరించారు అండి.ధన్యవాదాలు.🙏💐
రిప్లయితొలగించండి